Monday, May 25, 2020

దేశం -- వ్యవస్థ

భారత దేశంలో వ్యవస్థ సొంత ఆలోచనలతో వెళ్లడం 2000 సంవత్సరంతో ముగినిసినట్లు వుంది. ఏదైనా పాశ్చాత్య దేశాలలో చేస్తే, వెంటనే మన దేశంలో చేసేయాలి. మంచి, చెడు ఆలోచన తరవాత. ప్రపంచానికి మన వ్యవస్థ పెద్ద ప్రయోగశాలగా మారి పోతోంది. మన చదువు తప్పు అని, చదివితే  ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలని మన ప్రభుత్వ పెద్దలు తీర్మానించేసారు. ఇక్కడ చదవాలి బయట దేశంలో ఉద్యోగం చేయాలి. ఇదే మన కొత్త వ్యవస్థ. నువ్వు చదివే చదువు నీకుగానీ , నీ కుటుంబానికి గానీ, నీవు చూస్తున్న వ్యవస్థకు గానీ , దేశానికి గానీ అవసరమా అంటే: మొదటి రెండింటికీ ఆర్థికంగా కొంచెం ఉపయోగం కానీ, చివరి రెండింటికీ పెద్ద నష్టం చేశాయని చెప్పుకోవాలి.
౩౦౦ వందల సంవత్సరాలు ఆంగ్లేయులను ఎదిరించి నిలిచిన భాష, సంస్కృతి, గత 20 సంవత్త్సరాలలో పూర్తిగా ధ్వంసం చేసేసాం. ఇంకా నేలపై వున్నా చిన్న చితకా గురుతులను కూడా చిదిమేస్తున్నాం..
నా భారతదేశం ఎప్పటికీ బలంగా సొంత ఆలోచన విధానాలతో ఉండాలని అభిలషిస్తూ -- మీ రాజా 

No comments: