Monday, May 4, 2020

జ్ఙాపకం


దివాకరం వయస్సు 10 సంవత్సరాలు ఉండగా జరిగిన సంఘటన
బడి వదిలిన తరవాత ఇంటికి వచ్చిన దివాకరం తన స్నేహితుడైన రమేష్ ని ఆడుకొందాం అని పిలిస్తే, మా అమ్మ నీతో ఆడుకోవధ్ధు అన్నది అని చెప్పగానే దివాకరానికి ఎక్కడలేని కోపం వచ్చింది. సరే నేను సుబ్రహ్మణ్యం తో ఆడుకుంటాలే అని బయలుదేరాడు. సుబ్రహ్మణ్యం తన కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు అలాగే రమేష్ లాగా కాకుండా తన మాట వింటాడు అనే సంతోషం.
సుబ్రహ్మణ్యం తో కలిసి వంక దగ్గరకి వెళ్లి ఆడుకొందాం అని చెప్పగా, అది విన్న వాళ్ళ అమ్మమ్మ నీళ్ల దగ్గర జాగ్రత్త అని చెప్పి పంపింది. వంకలో కొంచెం సేపు ఇసుకతో  ఆడుకున్నతరువాత, నీళ్ల దగ్గరకు వెళ్లగా అక్కడ కొన్ని చేపలు, అలాగే తోక కప్పలు కనిపించాయి. వాటిని చూస్తూ కొంచెం సేపు ఆడుకున్న తరువాత, తెలియకుండానే నీళ్ళలోకి ఇద్దరూ దిగారు. చిన్నగా చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా, వంకలో గత సంవత్స్తరం మట్టి కోసం తీసిన పెద్ద గోతులు వున్నవిషయం తెలియక, అలాగే కొంచెం బురదగా ఉండటంతో నీళ్ల లోతు కూడా తెలియలేదు.
సుబ్రహ్మణ్యం వద్దురా అంటున్నా, ఇక్కడ ఏమీ లోతు లేదు అంటూ ఇంకా లోపలికి వెళ్తున్నాడు. వున్నట్లుండి, కనపడటం లేదు. అంతే, దివాకరం గుండెలు జల్లు మన్నాయి. ఇప్పుడు ఏమి చేయాలి?. అటు ఇటు చూడగా సుబ్రహ్మణ్యం మునిగిన చోటుకి అవతలి గట్టుకి రెండు మూరలు వుంది అంతే. మరేమీ ఆలోచించకుండా వెంటనే నీళ్లలో నడుచుకొంటూ వెళ్ళాడు. ఊపిరి బిగబట్టి సుబ్రమణ్యాన్ని ఒడ్డుకి తీసుకొచ్చాడు. అప్పటికి ఎంతో సమయం కాకపోవడం తో సుబ్రమణ్యానికి ఏమీ కాలేదు. లేచి కూర్చొని "అన్న నాకు ఏమైంది" అన్నాడు.
నువ్వు నీళ్లలో మునిగి పోయావు. దేవుడి దయవల్ల ఇద్దరం బతికి బయట పడ్డాం. విషయం ఎవరితో చెప్పొద్దు ముఖ్యంగా మీ అమ్మమ్మకి. సరే అన్న అన్నాడు సుబ్రహ్మణ్యం.
బతుకు జీవుడా అంటూ ఇంటికి బయలుదేరారు ఇద్దరూ.
సశేషం
అందరికీ వందనాలు

No comments: